తెలుగు రాష్ట్రాల్లో విశాఖ భయం

ABN , First Publish Date - 2020-05-09T12:44:26+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో విశాఖ భయం

తెలుగు రాష్ట్రాల్లో విశాఖ భయం

అమరావతి: విశాఖ ఘటన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇండస్ట్రీస్ ప్రాంతాల్లోని ప్రజలు భయపడిపోతున్నారు. ఆ ప్రాంతాల్లోని పరిశ్రమలను బయటకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎలాంటి నిబంధనలు ఉండాలి?... ఇలాంటి ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణల పరిస్థితి ఏంటి?. కొత్తగా కంపెనీలు వస్తున్నాయి... ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి...ఉద్యోగాలు వస్తున్నాయి. అయితే అక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా కొన్ని వందల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదకర రసాయనాలు ఉన్న కంపెనీలన్నీ జనావాసాల మధ్యలో ఉండటం ఎంత వరకు శ్రేయష్కరం. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రినర్స్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి పాల్గొన్నారు.  



Updated Date - 2020-05-09T12:44:26+05:30 IST