నేడు రాజధాని గ్రామాల్లో టీటీడీపీ మహిళా నేతల పర్యటన

ABN , First Publish Date - 2020-12-27T13:39:26+05:30 IST

నేడు రాజధాని గ్రామాల్లో తెలంగాణ టీటీడీపీ మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్నాతిరునగరి, టీటీడీపీ మహిళలు పర్యటించనున్నారు.

నేడు రాజధాని గ్రామాల్లో టీటీడీపీ మహిళా నేతల పర్యటన

అమరావతి: నేడు రాజధాని గ్రామాల్లో తెలంగాణ టీటీడీపీ మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్నాతిరునగరి, టీటీడీపీ మహిళ నేతలు పర్యటించనున్నారు. 376 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి ఉద్యమానికి వారు సంఘీభావం తెలపనున్నారు.  రైతులు, మహిళలు, వృద్ధులు నిరసనలు చేపట్టారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-27T13:39:26+05:30 IST