శ్రీవారి దర్శన ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి
ABN , First Publish Date - 2020-06-12T00:27:45+05:30 IST
శ్రీవారి దర్శన ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి

తిరుమల: శ్రీవారి దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం రోజు శ్రీవారిని 8 రాష్ట్రాల భక్తులు దర్శించుకున్నారని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ 143, తమిళనాడు 141, కర్ణాటక 151 మంది భక్తులతో పాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్ప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమబెంగాళ్ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.