కరోనా ఎఫెక్ట్.. అప్రమత్తమైన టీటీడీ
ABN , First Publish Date - 2020-03-16T16:04:13+05:30 IST
తిరుపతి: భక్తులు అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రమైన తిరుమలలో కరోనా ముప్పు భక్తుల దరి చేరకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు.
తిరుపతి: భక్తులు అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రమైన తిరుమలలో కరోనా ముప్పు భక్తుల దరి చేరకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాధి భక్తులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేసి.. రసాయనాలను స్ప్రే చేశారు. అలిపిరి పరిసర ప్రాంతాల్లో సైతం స్ప్రే చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు.