జూలై 30న గిరిజన వర్సిటీ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2020-06-11T11:47:15+05:30 IST
జూలై 30న గిరిజన వర్సిటీ ప్రవేశ పరీక్ష

ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం): విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ (సీటీయూ)లో ప్రవేశాలకు జూలై 30న పరీక్ష నిర్వహిస్తున్నట్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్వీ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి జూలై 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాయ్పూర్, బరంపూర్ (ఒడిసా), బెంగళూరుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.