ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
ABN , First Publish Date - 2020-05-13T14:46:23+05:30 IST
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలకు అధికారుల బదిలీ చేసింది. జిల్లాల వారీగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా ఏఎస్పీలను ప్రభుత్వం నియమించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్గా వినీత్ బ్రిజ్లాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే:
గుంటూరు రూరల్ - కె.ఆరిఫ్ హఫీజ్
తూర్పు గోదావరి - గరుడ్ సుమిత్ సునీల్
విశాఖపట్నం రూరల్ - రాహుల్ దేవ్ సింగ్
విశాఖ సిటీ - అజిత వేజెండ్ల
కర్నూలు - గౌతమి శాలి
కృష్ణా - వకుల్ జిందాల్
చిత్తూరు - రిషాంత్ రెడ్డి