గమనిక: నేటి నుంచి ఏపీలో ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవు

ABN , First Publish Date - 2020-06-04T13:44:20+05:30 IST

సుదీర్ఘ విరామం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఆయా రైల్వేస్టేషన్లు కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో

గమనిక: నేటి నుంచి ఏపీలో ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవు

విజయవాడ: సుదీర్ఘ విరామం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఆయా రైల్వేస్టేషన్లు కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో 22 ట్రైన్లు నడుస్తున్నాయి. అయితే నేటి నుంచి కొన్ని రైల్వేస్టేషన్లలో హాల్టులు రైల్వేశాఖ నిలిపివేసింది. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం కొన్ని స్టేషన్లలో స్టాప్‌లు నిలిపివేసినట్లు వెల్లడించింది. రద్దు చేసిన స్టేషన్లలో రైలు ఎక్కడానికి, దిగడానికి టికెట్లను అడ్వాన్సుగా బుక్‌ చేసుకున్న వారికి చార్జీలను పూర్తిస్థాయిలో తిరిగి చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది.


ఈ క్రింది స్టేషన్లలో రైళ్లు ఆగవు:

1. సికింద్రాబాద్‌-హౌరా(ఫలక్‌నుమా): పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట, పలాస, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగదు.

2. సికింద్రాబాద్‌-గుంటూరు(గోల్కొండ): కొండపల్లి, రాయనపాడు, కృష్ణాకెనాల్‌, మంగళగిరి, నంబూరు, పెదకాకానిలో ఆగదు.  

3. హైదరాబాద్‌-విశాఖ(గోదావరి): తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి, దువ్వాడ స్టేషన్లలో ఆగదు.

 4. తిరుపతి-నిజామాబాద్‌(రాయలసీమ): రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గూటి స్టేషన్లలో ఆగదు.

5. ముంబై-భువనేశ్వర్‌(కోణార్క్‌): తాడేపల్లిగూడెం, నిడదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగదు.

6. ముంబై-బెంగళూరు(ఉద్యాన్‌): ఆదోని, గూటి, ధర్మవరం, ప్రశాంతి నిలయం, పెనుకొండ, హిందూపురంలో ఆగదు.

7. దానాపూర్‌-బెంగళూరు(సంఘమిత్ర): గూడూరులో ఆగదు. బెంగళూరు-దానాపూర్‌(సంఘమిత్ర): రేణిగుంట, గూడూరులలో ఆగదు.

 


ఈ రైళ్లు ఆగుతాయి:

8. విశాఖపట్నం-న్యూఢిల్లీ(ఏపీ ఎక్స్‌ప్రెస్‌): రాజమండ్రి, ఏలూరు, బెజవాడలో ఆగుతుంది.

8. యశ్వంత్‌పూర్‌-హౌరా(దురంతో): విజయవాడ, రేణిగుంటలో ఆగుతుంది. విజయనగరంలో ఆగదు.

9. బెంగళూరు-నిజాముద్దీన్‌(రాజధాని): గుంతకల్‌, అనంతపురం స్టేషన్లలో ఆగుతుంది.

10. నిజాముద్దీన్‌-చెన్నై(బై వీక్లీ): విజయవాడలో ఆగుతుంది.

Updated Date - 2020-06-04T13:44:20+05:30 IST