ప్రకాశం జిల్లాలో సర్వం బంద్
ABN , First Publish Date - 2020-03-23T12:58:26+05:30 IST
ప్రకాశం: నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలో సర్వం బంద్ కానున్నాయి.
![ప్రకాశం జిల్లాలో సర్వం బంద్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020032307222671/03232020072807n97.jpg)
ప్రకాశం: నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలో సర్వం బంద్ కానున్నాయి. లాక్డౌన్ అమలు కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ను అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ప్రయివేట్ వాహనాలు సహా పూర్తిగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోనుంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ బంద్ కానున్నాయి. అత్యవసర, నిత్యావసరాలకు మాత్రమే అధికారులు అనుమతివ్వనున్నారు.