నేడు ఈశాన్య రుతుపవనాల రాక
ABN , First Publish Date - 2020-10-28T08:28:21+05:30 IST
దేశంలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనడంతోపాటు ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): దేశంలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనడంతోపాటు ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు బుధవారం దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించనున్నాయి. అదే సమయంలో దక్షిణ భారతంలోని ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల వల్ల దక్షిణకోస్తా, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.