శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి విశేష స్పందన
ABN , First Publish Date - 2020-05-29T14:33:49+05:30 IST
తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నాలుగు రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం 10 లక్షల లడ్డూలను విక్రయించడం విశేషం.

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నాలుగు రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం 10 లక్షల లడ్డూలను విక్రయించడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత సోమవారం నుంచే టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లడ్డూ విక్రయాన్ని ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల్లో లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.