తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2020-02-17T01:14:25+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారి టైంస్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారి టైంస్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నేటి సాయంత్రం 6 గంటల వరకు 56222 మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-02-17T01:14:25+05:30 IST