విజయవాడలో మూడో కేసు
ABN , First Publish Date - 2020-03-27T09:14:35+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కృష్ణాజిల్లాలో మూడో పాజిటివ్ కేసు నమోదైంది. స్వీడన్ నుంచి ఈనెల 18న విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల యువకుడికి...
- స్వీడన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా
- బుధవారం ప్రభుత్వాస్పత్రిలో చేరిక
- పరీక్షల్లో కొవిడ్-19 వైరస్ నిర్ధారణ
- రాష్ట్రంలో 11కి చేరిన పాజిటివ్ కేసులు
విజయవాడ, అనంతపురం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కృష్ణాజిల్లాలో మూడో పాజిటివ్ కేసు నమోదైంది. స్వీడన్ నుంచి ఈనెల 18న విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యాధికారులు గురువారం నిర్ధారించారు. దీంతో విజయవాడలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకి, రాష్ట్రవ్యాప్తంగా 11కి చేరినట్టయింది. అతని కుటుంబ సభ్యులకూ కరోనా సోకి ఉండొచ్చన్న అనుమానంతో వారినీ ఐసోలేషన్ వార్డుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. అనంతపురం జిల్లాలో గురువారం ఐదు, కాకినాడ జీజీహెచ్లో 11 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారికి వైద్యపరీక్షలు నిర్వహించి వారి శాంపిళ్లను పరీక్షలకు ల్యాబ్కు పంపించారు.