విజయవాడలో మూడో పాజిటివ్ కేసు
ABN , First Publish Date - 2020-03-27T14:47:25+05:30 IST
నగరంలో కరోనా వైరస్ మూడో పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
విజయవాడ: నగరంలో కరోనా వైరస్ మూడో పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు పరిసరాల్లో నివసిస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన యువకులు కలిసిన వారి వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిపై అధికారులు మరింత దృష్టి సారించారు.