రాజ్యసభ ఎన్నికలకు మాక్ పోల్ నిర్వహించిన వైసీపీ

ABN , First Publish Date - 2020-06-18T20:42:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రాజ్యసభ ఎన్నికలకు మాక్ పోల్ నిర్వహించిన వైసీపీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమాల్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి, అలాగే టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో నిలిచారు. ఒక్కొక్క స్థానానికి కనీసం 34 మంది ఎమ్మెల్యేలను వైసీపీ కేటాయించింది. ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యేలతో మాక్ పోల్ నిర్వహించింది. మాక్ పోల్‌కు ముందు ఓటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎమ్మెల్యేలకు వెలగపూడి సచివాలయంలో ఎంపీ విజయసాయి సూచనలు చేశారు. 



ప్రాధాన్య వోటింగ్ విధానంపై ఎమ్మెల్యేలు ఎలా ఓటింగ్ చేయాలో వివరించారు. 

Updated Date - 2020-06-18T20:42:30+05:30 IST