ఆ ఇద్దరు మంత్రులు మూర్ఖంగా ప్రవర్తించారు: నాగ జగదీష్
ABN , First Publish Date - 2020-06-18T18:31:51+05:30 IST
శాసనమండలిలో బుధవారం వైసీపీ మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్ మూర్ఖంగా..

అమరావతి: శాసనమండలిలో బుధవారం వైసీపీ మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్ మూర్ఖంగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క సీఎం తప్ప మంత్రులంతా మండలిలోనే ఉన్నారని, ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయారని విమర్శించారు. అనిల్ కుమార్ అయితే సభలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించలేదని, బూతులు మాట్లాడారని ఏం పీక్కుంటారో పీక్కోండంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. మరో మంత్రి శ్రీనివాస్ అయితే సభ్యులమనే గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. 151మందితో అధికారంలోకి వచ్చామని మంత్రులు విర్రవీగిపోయి నోటికొచ్చినట్లు బూతులు తిట్టారేతప్ప ప్రజలకు ఉపయోగపడే చర్చలు జరగలేదని నాగ జగదీష్ అన్నారు.