ఏపీలో కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికలు
ABN , First Publish Date - 2020-06-19T17:59:21+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఇప్పటి వరకు 135 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో ఆయన ఓటు వేసే అవకాశం లేనందున కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. అనుమతి ఇస్తే ప్రాక్సీ ఓటింగ్ ద్వారా అచ్చెన్నాయుడు ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పారు. కాగా టీడీపీ ఉనికిని కాపాడుకోవడం కోసం తమ అభ్యర్థిని పోటీలో నిలిపిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.