రాజధాని కేసులపై రేపటి నుంచి హైకోర్టులో రోజువారీ విచారణ
ABN , First Publish Date - 2020-10-05T00:44:47+05:30 IST
రాజధాని కేసులపై సోమవారం నుంచి హైకోర్టు రోజువారీ విచారిస్తారు. అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి వచ్చే న్యాయవాదులు..
అమరావతి: రాజధాని కేసులపై సోమవారం నుంచి హైకోర్టులో రోజువారీ విచారిస్తారు. అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి వచ్చే న్యాయవాదులు.. హైబ్రిడ్ సిస్టం ద్వారా వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పిటీషనర్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై రేపు ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణపై.. సీఎస్ సంతకంతో కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు గత నెల 21న సమయం ప్రభుత్వం కోరింది.