అధికారిక ఉత్సవంగా గురజాడ జయంతి
ABN , First Publish Date - 2020-09-19T09:07:27+05:30 IST
అధికారిక ఉత్సవంగా గురజాడ జయంతి
విజయనగరం(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 18: మహాకవి గురజాడ అప్పారావు జయంతిని అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసినట్లు విజయనగరం కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్ తెలిపారు. ఈ నెల 21న జయంతి నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.