బంగ్లాదేశ్కు తొలి కార్గో రైలు
ABN , First Publish Date - 2020-11-19T10:12:15+05:30 IST
వాల్తేరు రైల్వే డివిజన్ నుంచి బంగ్లాదేశ్కు తొలి సరుకు రైలు(కార్గో)ను బుధవారం పంపించారు. సుమారు 2,424 టన్నుల
![బంగ్లాదేశ్కు తొలి కార్గో రైలు](https://media.andhrajyothy.com/appimg/galleries/20201119043862/11192020044400n46.jpg)
విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వాల్తేరు రైల్వే డివిజన్ నుంచి బంగ్లాదేశ్కు తొలి సరుకు రైలు(కార్గో)ను బుధవారం పంపించారు. సుమారు 2,424 టన్నుల మొక్కజొన్నను 42 వ్యాగన్లలో లోడింగ్ చేసి బెనాపోల్ అనే ప్రాంతానికి తరలించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఆర్థికంగా, భద్రతపరంగా రైల్వేనే ఉత్తమమని ఈ ప్రాంత వ్యాపారులు భావిస్తున్నారని, అందుకే ఆదరణ బాగుందని డీఆర్ఎం చేతన్కుమార్ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు.