బీఈడీ కోర్సు ఫీజు ఖరారు
ABN , First Publish Date - 2020-04-21T10:32:43+05:30 IST
2019-20 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్సు ట్యూషన్ ఫీజును ప్రభుత్వం ఖరారు

అమరావతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): 2019-20 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్సు ట్యూషన్ ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సిఫారసు మేరకు రాష్ట్రంలోని 354 బీఈడీ కళాశాలలకు ఫీజులను ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కనిష్ట ఫీజు రూ.13,500లుగా, గరిష్ట ఫీజు రూ.22,700లుగా నిర్ణయించారు.