అపుస్మా విరాళం రూ.50 లక్షలు
ABN , First Publish Date - 2020-05-17T10:21:24+05:30 IST
ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) రూ.50 లక్షలు విరాళాన్ని అందించింది.
![అపుస్మా విరాళం రూ.50 లక్షలు](https://media.andhrajyothy.com/appimg/galleries/20200517992/05172020045236n31.jpg)
కొల్లూరు, మే 16: ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) రూ.50 లక్షలు విరాళాన్ని అందించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అపుస్మా అధ్యక్షుడు ఎంవీ రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలసాని తులసీ విష్ణుప్రసాద్, కోశాధికారి ఎంవీ రావు, ప్రతినిధులు ఎంఎస్ రెడ్డి, విజయ్లు శనివారం సీఎం జగన్కు చెక్కును అందజేశారు.