-
-
Home » Andhra Pradesh » TG Venkatesh Rayalaseema
-
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో రాయలసీమకు అన్యాయం: టీజీ వెంకటేష్
ABN , First Publish Date - 2020-12-19T18:06:08+05:30 IST
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు.

కర్నూలు: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఈవిషయాన్ని సీఎం జగన్ సీరియస్గా తీసుకోవట్లేదని ఆయన ఆరోపించారు. రాయలసీమలో మినీ సెక్రటేరియట్ పెట్టాలని డిమాండ్ చేశారు. సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తేనే రాయలసీమలో నీటి సమస్యకు పరిష్కారం అవుతుందని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.