అంతర్వేది దేవస్థానం వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-09-06T19:02:00+05:30 IST
సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం..
రాజమండ్రి: సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం అగ్నికి ఆహుతి అయిన సంఘటనతో దేవస్థానం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవస్థానంకు సంబంధించిన సీసీ కెమరాలు పనిచేయక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని ఆర్ఎస్ఎస్ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు ఆందోళన చేపట్టారు.