తెనాలిలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-08T15:15:27+05:30 IST
తెనాలిలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

గుంటూరు: తెనాలిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా మరో 15 కేసులు నమోదు అయ్యాయి. తెనాలి మున్సిపల్ కమిషనర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ ప్రేమ్కుమార్ కరోనాతో మృతి చెందారు. కరోనా సోకడంతో సిద్ధార్థ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున డాక్టర్ ప్రేమ్కుమార్ మృత్యువాతపడ్డారు.