వైసీపీ కార్యకర్త ఇంటిలో తెలంగాణ మద్యం
ABN , First Publish Date - 2020-12-30T08:38:47+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరుకు చెందిన వైసీపీ కార్యకర్త ఇంటిలో ఏడు లక్షల రూపాయల విలువైన తెలంగాణ మద్యం నిల్వలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
పాలకోడేరు/భీమవరం క్రైం, డిసెంబరు 29: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరుకు చెందిన వైసీపీ కార్యకర్త ఇంటిలో ఏడు లక్షల రూపాయల విలువైన తెలంగాణ మద్యం నిల్వలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ట్రావెల్స్ నిర్వహిస్తున్న గుంటూరి శ్రీనివాసరాజు బొలేరో వాహనంలో రొయ్యల మేత తరలిస్తూ వాటి మధ్యలో మద్యాన్ని అక్రమంగా పలు దఫాలుగా తీసుకువచ్చాడు.