విశాఖ: టీడీపీ-వైసీపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు

ABN , First Publish Date - 2020-12-27T15:08:37+05:30 IST

తూర్పు నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు.

విశాఖ: టీడీపీ-వైసీపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు

విశాఖ: తూర్పు నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. కయ్యానికి కాలు దువ్వడమే పనిగా వైసీపీ దూకుడు పెంచింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వెలగపూడికి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాల్ చేశారు. అవినీతికి పాల్పడకపోతే ఈస్ట్ పాయింట్ కాలనీలో సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు.


ఆదివారం ఉదయం 11 గంటలకు సాయిబాబా గుడికి తాను వస్తాన్నానని అమర్నాథ్ అన్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో బాబా గుడి వేదికగా రాజకీయ రచ్చగా మారడంతో తూర్పు విశాఖలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. అమర్నాథ్ సవాల్‌పై స్పందించిన వెలగపూడి మాట్లాడుతూ తాను సవాలు విసిరింది విజయసాయిరెడ్డికి అయితే..వీళ్లంతా ఎవరంటూ ప్రశ్నించారు. దీనిపై ఆదివారం ఉదయం 11 గంటలకు వెలగపూడి మీడియా సమావేశంలో మాట్లాడతానన్నారు.

Updated Date - 2020-12-27T15:08:37+05:30 IST