అంబులెన్స్లో కుక్కేశారు!
ABN , First Publish Date - 2020-07-18T08:43:54+05:30 IST
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరులో మూడు రోజుల క్రితం 10మందికి పాజిటివ్

కర్నూలు, జూలై 17(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరులో మూడు రోజుల క్రితం 10మందికి పాజిటివ్ వచ్చింది. వారందరినీ ఒకే అంబులెన్సులో ఒకేసారి ఐసొలేషన్కు తరలించారు. ఒక రైతు ఎక్కడానికి నిరాకరించడంతో ఆస్పత్రి దగ్గరలోనే ఉంది కదా..! త్వరగా వెళ్లిపోవచ్చు అంటూ 108 సిబ్బంది నచ్చజెప్పి మరీ అంబులెన్సులో కుక్కారు.
జంతువుల్లా తోలుతారా: చంద్రబాబు
108 వాహనంలో కొవిడ్ బాధితులను జంతువుల మాదిరి తోలుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా ఉంటే కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యే వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు అవుతుందన్నారు. రాష్ట్రాన్ని దేముడే కాపాడాలని వ్యాఖ్యానించారు.