సీఎం జగన్పై మండిపడ్డ టీడీపీ నేత పట్టాభి
ABN , First Publish Date - 2020-10-14T23:25:48+05:30 IST
సీఎం జగన్పై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. క్రిమినల్ అయిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతికి వ్యతిరేకంగా చేయాల్సిన కుట్రలన్నీ

గుంటూరు: సీఎం జగన్పై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. క్రిమినల్ అయిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతికి వ్యతిరేకంగా చేయాల్సిన కుట్రలన్నీ చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వరద ముంపులో అమరావతిని తేలేలా చేయడానికి ఆ ప్రాంతంలో భారీగా వరద నీటిని నిల్వ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు మూడు రెట్లకు ఎలా పెరిగింది? కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం మోటార్లు కూడా ఆన్ చేయకుండా జగన్ ప్రభుత్వం రాజధానితో వికృత జలక్రీడ ఆడింది’ అని పట్టాభి ధ్వజమెత్తారు.