తమిళనాడులో పట్టుబడ్డ నగదుపై నారా లోకేష్ తాజా ట్వీట్ ఇదే..

ABN , First Publish Date - 2020-07-19T01:16:50+05:30 IST

తమిళనాడులో పట్టుబడ్డ డబ్బు ఎవరిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఏపీలో

తమిళనాడులో పట్టుబడ్డ నగదుపై నారా లోకేష్ తాజా ట్వీట్ ఇదే..

అమరావతి: తమిళనాడులో పట్టుబడ్డ డబ్బు ఎవరిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఏపీలో కొల్లగొట్టిన కోట్ల కొద్దీ నల్లధనాన్ని వైసీపీ నేతలు ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించిన కార్లలో చెన్నైకి చేరవేస్తున్నారన్నది బయటపడింది. ఇలా వెళ్తున్న డబ్బు ఎవరిది?, ఆ డబ్బు చెన్నై నుంచి హవాలా మార్గంలో మారిషస్‌కు వెళ్ళేది నిజమేనా?, ఇవి ఇప్పుడు తేలాలి. చెన్నైలో ఒకే అడ్రస్‌తో ఉన్న ఫారెస్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీలకు వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. హవాలాకు కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఇ-మెయిల్ అడ్రస్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిది. పైగా ఈ సంస్థను వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబర్ 20న రిజిస్టర్ చేసారు. అంటే అది సూట్ కేసు సంస్థ అన్నట్టే కదా?, అక్రమంగా దోచుకోవడం, సూట్ కేసు సంస్థలు పెట్టి వాటిల్లోకి మళ్ళించడం, అక్కడ నుంచి హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం. ఏ-1, ఏ-2ల గత చరిత్ర మొత్తం ఇదే!. ఇప్పుడూ అదే నడుస్తోంది. ఈ మొత్తం తతంగంపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి.’’ అంటూ నారా లోకేష్ నిలదీశారు.

Updated Date - 2020-07-19T01:16:50+05:30 IST