అనుచితంగా మాట్లాడినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం: మంత్రి అనిల్
ABN , First Publish Date - 2020-06-18T23:09:54+05:30 IST
అనుచితంగా మాట్లాడినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం: మంత్రి అనిల్

గుంటూరు: టీడీపీ నేతలపై రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు. కౌన్సిల్ లో టీడీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని, టీడీపీ చెప్పిందే శాసనంలా ప్రవర్తించిందని, టీడీపీకి ఎప్పుడు అవసరమొస్తే.. అప్పుడు సభా సంప్రదాయాలను మారుస్తామంటే ఎలా? అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందకుండా చేయాలని కుట్రపన్నారని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ లో తాను అనుచితంగా మాట్లాడినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్దమని, నిరూపించలేకపోతే టీడీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.