మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తిగా విఫలం: నాగజదీశ్వరరావు
ABN , First Publish Date - 2020-09-17T04:21:09+05:30 IST
దేవాదాయశాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. కనకదుర్గ ఆలయంలో...
విజయవాడ: దేవాదాయశాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. కనకదుర్గ ఆలయంలో రథంపై వెండి సింహాలు మాయమై 48 గంటలు గడిచినా ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయశాఖను తన సొంత ఆదాయశాఖగా మార్చుకున్నారని నాగజగదీశ్వరరావు ఆరోపించారు.