విగ్రహాలు తొలగించడం దుర్మార్గం: లోకేష్
ABN , First Publish Date - 2020-09-14T00:26:52+05:30 IST
విగ్రహాలు తొలగించడం దుర్మార్గం: లోకేష్
అమరావతి: గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో నందమూరి తారకరామారావు, పరిటాల రవీంద్ర విగ్రహాలు తొలగించడం దుర్మార్గమని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. ప్రశ్నించిన టీడీపీ సీనియర్ నేత జీవి ఆంజనేయులుని హౌస్ అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు.