సున్నా వడ్డీ కాదు...సున్నా పరిపాలన: యనమల
ABN , First Publish Date - 2020-04-24T16:56:11+05:30 IST
సున్నా వడ్డీ కాదు...సున్నా పరిపాలన: యనమల
![సున్నా వడ్డీ కాదు...సున్నా పరిపాలన: యనమల](https://media.andhrajyothy.com/appimg/galleries/2020042411243071/04242020112554n88.gif)
అమరావతి: జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనీయర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సున్నా వడ్డీ కాదు.. రాష్ట్రంలో పరిపాలన సున్నా అని విమర్శించారు. దుబారా సొమ్ముతో వైద్యులకు ఎన్నో పీపీఈలు వచ్చేవన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని తానే తెచ్చానని జగన్ అసెంబ్లీలో చెప్పాడని...టీడీపీ అంకెలతో సహా రుజువు చేసే సరికి మాట తప్పాడని అన్నారు. సీఎం జగన్ అబద్ధాల పితామహుడిగా మారారని వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పథకాలకు బకాయిలు ఎగ్గొట్టడం గర్హనీయమన్నారు. 45 ఏళ్లకే పెన్షన్ హామీ గాలికి వదిలేసి మహిళల్ని మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి పేద మహిళకు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించాలని యనమల డిమాండ్ చేశారు.