విజయసాయిరెడ్డి కరోనాకు అతీతుడా?: వర్ల రామయ్య ట్వీట్

ABN , First Publish Date - 2020-04-21T14:07:54+05:30 IST

విజయసాయిరెడ్డి కరోనాకు అతీతుడా?: వర్ల రామయ్య ట్వీట్

విజయసాయిరెడ్డి కరోనాకు అతీతుడా?: వర్ల రామయ్య ట్వీట్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముఖ్య మంత్రి గారు! 14 రోజులు క్వారంటైన్‌కు వెళ్లవలసి వస్తుందని యూపీ ముఖ్యమంత్రి తన తండ్రి అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లలేదు. మరి ఏ2 విజయసాయిరెడ్డి నేషనల్ పెర్మిట్ లారీ లాగా రాష్ట్రాలన్నీ కలియ తిరుగుతున్నాడు. ఈయనను క్వారంటైన్‌కు పంపక్కర్లేదా? కరోనాకు అతీతుడా? మీ ప్రభుత్వం తప్పు కదూ?’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-04-21T14:07:54+05:30 IST