స్వప్రయోజనాల కోసమే ఏపీఆర్టీసీ తాకట్టు: పట్టాభి
ABN , First Publish Date - 2020-11-04T01:07:28+05:30 IST
స్వప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టుపెడితే.. మంత్రులు ఆయనకు ఏమాత్రం తీసిపోలేదని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. తెలంగాణతో ఏపీఎస్ ఆర్టీసీ దిక్కుమాలిన ఒప్పందం చేసుకుందని మండిపడ్డారు. తెలంగాణకు మేలు
అమరావతి: స్వప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టుపెడితే.. మంత్రులు ఆయనకు ఏమాత్రం తీసిపోలేదని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. తెలంగాణతో ఏపీఎస్ ఆర్టీసీ దిక్కుమాలిన ఒప్పందం చేసుకుందని మండిపడ్డారు. తెలంగాణకు మేలు కలిగేలా దిక్కుమాలిన ఒప్పందాలు చేసుకోవడంతో జగన్ ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల పాలుచేయాలని చూస్తోందని విమర్శించారు. మంత్రి పేర్నినాని హైదరాబాద్లోని తన ఆస్తులను కాపాడుకోవడానికే ఏపీ ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని పట్టాభి ఆరోపించారు.