విద్యుత్ బిల్లులపై ఎస్ఈని కలిసిన టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2020-05-18T18:09:36+05:30 IST
నెల్లూరు: విద్యుత్ బిల్లులపై టీడీపీ నేతలు ఎస్ఈని కలిశారు. బిల్లుల తగ్గించాలని డిమాండ్ చేశారు. చిన్నపరిశ్రమలు, వ్యాపారాలు, హోటళ్లు మూతపడ్డాయని.
![విద్యుత్ బిల్లులపై ఎస్ఈని కలిసిన టీడీపీ నేతలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నెల్లూరు: విద్యుత్ బిల్లులపై టీడీపీ నేతలు ఎస్ఈని కలిశారు. బిల్లుల తగ్గించాలని డిమాండ్ చేశారు. చిన్నపరిశ్రమలు, వ్యాపారాలు, హోటళ్లు మూతపడ్డాయని.. అయినా కూడా భారీగా కరెంటు బిల్లులు వచ్చాయన్నారు. విద్యుత్ బిల్లులు రద్దు చేయమని జనం కోరుతుంటే, ప్రభుత్వం వేల రూపాయలు వడ్డించడమేంటని ప్రశ్నించారు. ఇంజనీర్లు సక్రమంగానే బిల్లులు ఇచ్చామంటున్నారని... ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం చేశారు.