పోలీసుల ఎదుట లొంగిపోయిన కూన రవికుమార్
ABN , First Publish Date - 2020-03-02T20:11:06+05:30 IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరుబుజ్జిలి ఈవోపీఆర్డీని దూషించారన్న కేసులో ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లి సరండర్ అయ్యారు

శ్రీకాకుళం: టీడీపీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరుబుజ్జిలి ఈవోపీఆర్డీని దూషించారన్న కేసులో ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లి సరండర్ అయ్యారు.
జేఏసీ ఆగ్రహం..
ఇదిలా ఉంటే టీడీపీ నేత కూన రవికుమార్పై అమరావతి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూన రవి వ్యాఖ్యలను ఈవోపీఆర్డీ, డీపీవో, డీఎల్పీవోల రాష్ట్ర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈవోపీఆర్డీని కూన రవి బూతులు తిట్టడం దారుణమని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇలానే అధికారులను దుర్భాషలాడారని గుర్తుచేశారు. చదువుకున్న వ్యక్తులెవరైనా ఇలా మాట్లాడతారా?, కూన రవికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.