5కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయండి గవర్నర్ గారు: దేవినేని

ABN , First Publish Date - 2020-07-20T18:32:23+05:30 IST

5కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయండి గవర్నర్ గారు: దేవినేని

5కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయండి గవర్నర్ గారు: దేవినేని

అమరావతి: రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో న్యాయం చేయాలంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా వినతి చేశారు.‘‘పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపామని ప్రభుత్వమే కోర్టులో చెప్పింది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఒకే రాజధాని అని ఉంది. 68 మంది అమరులైనా 216 రోజులుగా కరోనాలో కూడా ఉద్యమిస్తున్న 5 కోట్లమంది ప్రజలు మీ కార్యాలయంవైపు చూస్తున్నారు న్యాయం చేయండి గవర్నర్‌ గారు’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-07-20T18:32:23+05:30 IST