నాడు నమ్మించారు...నేడు మోసం చేశారు: దేవినేని
ABN , First Publish Date - 2020-08-01T14:20:21+05:30 IST
వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలుపడంతో...అమరావతి మూడు

అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలుపడంతో...అమరావతి మూడు రాజధానులుగా చూస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఎన్నికల ముందు ప్రజారాజధానిగా అమరావతి ఉంటుందని ప్రజలను నమ్మించారు. నేడు మోసం చేశారు. ఏరు దాటేవరకు ఏటిమల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అంటూ.. మాట తప్పారు.. మడమ తిప్పారు..నాడు మీరు, మీ నాయకులు మాట్లాడిన మాటలకు ప్రజలకు సమాధానం చెప్పండి’’ సీఎం జగన్ గారు అంటూ దేవినేని ట్వీట్ చేశారు.