జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: టీడీపీ నేత జవహర్
ABN , First Publish Date - 2020-06-19T04:52:19+05:30 IST
జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: టీడీపీ నేత జవహర్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు. దొంగబ్బాయి జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని జవహర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను అమ్మేయాలని, అమరావతి లేకుండా చేయాలనే మీ కుట్రలను ప్రజలే తిప్పికొడతారని టీడీపీ నేత జవహర్ హెచ్చరించారు. మీరు రాజారెడ్డి రాజ్యాంగంతో అరాచకాలకు పాల్పడుతుంటే, తాము అంబేద్కర్ రాజ్యాంగం రక్షగా అడ్డుకుంటామని టీడీపీ నేత జవహర్ అన్నారు.