శిలా ఫలకాన్ని ధ్వసం చేసిన వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2020-04-28T20:09:00+05:30 IST
లాక్ డౌన్ సమయంలో కూడా విశాఖలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు మాత్రం

విశాఖ: లాక్ డౌన్ సమయంలో కూడా విశాఖలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు మాత్రం ఆగడంలేదు. ఎస్ రాయవరం గ్రామంలో స్థానిక వైసీపీ నేతలు శిలాఫలకాన్ని ద్వంసం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గురజాడ అప్పారావు జ్ఞాపకార్థం కళాక్షేత్రం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే అనిత శంఖుస్థాపన చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అయితే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని స్థానిక వైసీపీ నేతలు ధ్వంసం చేయించారని స్థాయిక టీడీపీ నేతలు చెబుతున్నారు.