సమర్థవంతమైన సైనికుడిని పార్టీ కోల్పోయింది.. ఊట్కూరికి బాబు నివాళి
ABN , First Publish Date - 2020-10-07T22:24:04+05:30 IST
టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి ఊట్కురి వేంకటేశ్వర రావు మరణం పార్టీకి తీరనిలోటని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించిన ఆయన..

అమరావతి: టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి ఊట్కురి వేంకటేశ్వర రావు మరణం పార్టీకి తీరనిలోటని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించిన ఆయన.. ఒక సమర్ధవంతమైన సైనికుడిని పార్టీ కోల్పోయిందని పేర్కొన్నారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Read more