ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
ABN , First Publish Date - 2020-04-09T12:32:51+05:30 IST
ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
అమరావతి: ఇవాళ ఉదయం 11.30 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, ప్రభుత్వాల చర్యలు, రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఉపాధి లేక కూలీల ఇక్కట్లు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు.