లోక్సభ స్థానాల్లో తెలుగు మహిళ సారథులు
ABN , First Publish Date - 2020-10-02T07:14:22+05:30 IST
రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు టీడీపీ తెలుగు మహిళ కమిటీలను ప్రకటించింది. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఖరారు చేసి వారి పేర్ల జాబితాను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత గురువారమిక్కడ విడుదల చేశారు...
అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు టీడీపీ తెలుగు మహిళ కమిటీలను ప్రకటించింది. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఖరారు చేసి వారి పేర్ల జాబితాను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత గురువారమిక్కడ విడుదల చేశారు. మిగిలిన కార్యవర్గాన్ని తర్వాత ఎంపిక చేస్తామన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ఈ వైఫల్యంపై తమ కమిటీలు బలంగా పోరాడి బాధితులకు అండగా నిలుస్తాయని చెప్పారు.