జగన్ ప్రకటన చేతకానితనమే: అఖిలప్రియ
ABN , First Publish Date - 2020-04-29T01:43:16+05:30 IST
కరోనా కేసులను దాచిపెడుతూ ప్రజలకు ప్రభుత్వం నష్టం చేస్తోందని టీడీపీ నేత అఖిలప్రియ మండిపడ్డారు.

కర్నూలు: కరోనా కేసులను దాచిపెడుతూ ప్రజలకు ప్రభుత్వం నష్టం చేస్తోందని టీడీపీ నేత అఖిలప్రియ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో 300కు పైగా కేసులు నమోదవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో మిగిలిన కేసులనూ తక్షణమే ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసులు దాచిపెట్టడం వెనుక ప్రభుత్వం అజెండా ఏమిటో అర్థంకావడంలేదన్నారు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే వీడియో రికార్డులు సీఎం ఎందుకిస్తున్నారు? అని ప్రశ్నించారు. కరోనాతో కలిసి జీవించాలన్న జగన్ ప్రకటన చేతకానితనమేనని మండిపడ్డారు.