‘కలుషిత నీరు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు’

ABN , First Publish Date - 2020-12-06T19:51:40+05:30 IST

‘కలుషిత నీరు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు’

‘కలుషిత నీరు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు’

విజయవాడ: ఏలూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. తక్షణమే సురక్షిత మంచి నీటిని సరఫరా చేయాలన్నారు. 5 రోజుల నుంచి కలుషిత నీరు వస్తుందని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. 

Updated Date - 2020-12-06T19:51:40+05:30 IST