తమ్మిలేరు జలాశయానికి వరద ముప్పు
ABN , First Publish Date - 2020-09-14T14:43:08+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తమ్మిలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉంది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తమ్మిలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉంది. నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో ముప్పు ఏర్పడింది. ఇప్పటికే ఏలూరు శనివారపుపేట కాజ్ వే పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు కాజ్ వే పై నుంచి రాకపోకలను నిలిపివేశారు.