సుప్రీం తీర్పు నేపథ్యలో సీఎం జగన్‌కు కేశినేని శ్వేత ట్వీట్

ABN , First Publish Date - 2020-03-18T20:49:09+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన విషయం తెలిసిందే.

సుప్రీం తీర్పు నేపథ్యలో సీఎం జగన్‌కు కేశినేని శ్వేత ట్వీట్

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తప్పు పడుతూ సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు జగన్ సర్కార్‌కు చెంపపెట్టని వ్యాఖ్యానిస్తున్నాయి.


ఇదిలా ఉంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని తనయురాలు, టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ.. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. రాజకీయాలు పక్కనపెట్టి కనీసం ఇప్పుడైనా ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించండి. మాస్కులు, శానిటైజర్లని ఉచితముగా పంపిణీ చేయండి’’ అంటూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2020-03-18T20:49:09+05:30 IST