టీటీడీలో అక్రమాలపై విచారణ కోసం స్వామి పిల్
ABN , First Publish Date - 2020-09-03T07:44:25+05:30 IST
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరిగిన

అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరిగిన అక్రమాలపై కాగ్ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సత్యపాల్ సభర్వాల్తో కలిసి తాను ఈ పిల్ వేసినట్టు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. టీటీడీలో జరిగిన అక్రమాలు, టీటీడీ ఖాతాల లావాదేవీలపై కాగ్ ఆడిట్ చేయించాలని వారు కోరారు.