బీజేవైఎం అధ్యక్షుడిగా సురేంద్ర
ABN , First Publish Date - 2020-12-26T08:02:17+05:30 IST
భారతీయ జనతా యువమెర్చా రాష్ట్ర కమిటీని పార్టీ నాయకత్వం శుక్రవారం ప్రకటించింది.
![బీజేవైఎం అధ్యక్షుడిగా సురేంద్ర](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
భారతీయ జనతా యువమెర్చా రాష్ట్ర కమిటీని పార్టీ నాయకత్వం శుక్రవారం ప్రకటించింది. సురేంద్ర మోహన్ అధ్యక్షుడుగా, మిట్టా వంశీ, బైరెడ్డి శబరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా దిలీప్ నాయుడు కోశాధికారిగా నియమితులయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సమతూకం పాటిస్తూ ఐదుగురు ఉపాధ్యక్షులు(ఆనంద్, రవీంద్ర, వంశీ, రవీంద్రరెడ్డి, రాజే్ష)గా నియమించిన రాష్ట్ర పార్టీ విశ్వతేజ, కృష్ణ చైతన్య, ఆదిత్య, రాజేశ్, పవన్, సూర్యతేజను రాష్ట్ర కార్యదర్శులుగా ప్రకటించింది.